దర్శి: దర్శి మండలంలోని పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించిన ఎస్సై మురళి
Darsi, Prakasam | Apr 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ప్రజలకు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఎస్సై మురళి పలు సూచనలు చేశారు. పదో తరగతి ఇంటర్ పరీక్షలు ముగిశాయి పది రోజులలో వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో కుంటలు చెరువులు, కాలువలలో విద్యార్థులు ఈతల కొట్టడానికి వెళుతూ ఉంటారు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోతుంటారు. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లి పిల్లలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.