మార్కాపురం: దరిమడుగు గ్రామానికి వెళ్లే తారు రోడ్డు మురుగునీటితో అవస్థలు పడుతున్న వాహనదారులు
మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి వెళ్లే తారు రోడ్డులో మురుగు నీటితో అధ్వానంగా మారింది. జాతీయ రహదారి లేకముందు ఈ రోడ్డునే వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగాయి. జాతీయ రహదారి ఏర్పడిన తర్వాత అక్కడి నుండి గ్రామంలోకి వెళ్లాలంటే మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు