మార్కాపురం: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్ల హెచ్చరిక
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎండ తీవ్రత కు ప్రజలు అల్లాడిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది అని తెలిపారు. అధిక వేడి ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే కష్టంగా మారింది. ఒకవైపు వేడిమి మరొకవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన వీధులు కూడా ఖాళీగా కనపడ్డాయి. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరించారు.