దర్శి: దొనకొండ మండలంలో పేకాట శిబిరంపై దాడి చేసిన ఎస్ఐ రామకృష్ణ
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని చిన్న గుడిపాడు గ్రామ పొలాలలో ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో పేకాట శిబిరం పై దాడి చేశారు. ఆరుగురు పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు . వారి వద్ద ఉన్న సుమారు 40370 రూపాయల నగదు ఆరు సెల్ ఫోన్లు ఐదు మోటర్ సైకిల్స్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.