రాయదుర్గం: రాయదుర్గం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్సార్ జయంతి
*మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు* మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని బుధవారం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. డి.హిరేహాల్, కణేకల్లు, గుమ్మఘట్ట, బొమ్మనహాల్, రాయదుర్గం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, 108 సేవలు వంటి అనేక పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.