యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎమ్మార్వో విజయభాస్కర్
మార్కాపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఎండల ప్రభావము తీవ్రంగా ఉండన్నట్లు రియల్ టైం గవర్నెన్స్ హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిపురాంతకం మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో విజయభాస్కర్ హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దు అని సూచించారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీరు తీసుకోవాలన్నారు. గ్రామాలలో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.