మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఆటిజం సెంటర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఆటిజం సెంటర్ కు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి లోకేష్ విద్యావ్యవస్థలో నూతన వరవడితో ముందుకు వెళుతున్నారని అన్నారు. అందులో భాగంగా 42 లక్షలతో ఆటిజం సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్ నాయక్ హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.