కొండపి: పొన్నలూరులో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అధికారి ఎస్తేరమ్మ
పొన్నలూరు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దారు కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ప్రకృతి వ్యవసాయ అధికారి ఎస్తేరమ్మ తెలిపారు. రైతులు ఈ విధానంతో అధిక లాభాలు పొందవచ్చని, ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె సూచించారు.