రాయదుర్గం: డిమాండ్ల సాధన కోసం ఏపిపిటిడి ఉద్యోగులు నిరసనబాట, డిపో ఎదుట ధర్నా
డిమాండ్ల సాధన కోసం ఏపిపిటిడి ఉద్యోగులు నిరసనబాట పట్టారు. ఆర్టీసీ జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు రాయదుర్గం డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ లు సంయుక్తంగా మంగళవారం ఉదయం నుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి దర్నా చేపట్టారు. జెఏసి నాయకులు తిప్పేస్వామి, జిలాన్ రామలింగ, నాగరాజు తదితరులు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.