గిద్దలూరు: ఈనెల 13వ తేదీ నుంచి గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం మార్గాల మధ్య కొత్త రైలు, 4 జిల్లాలలో నడవనున్న రైలు
ఈనెల 13వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు, మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య ప్యాసింజర్ రైలు నడిపేందుకు సిద్ధమయింది. 57407/ 57408 నంబర్ తో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ప్రతిరోజు గుంతకల్లులో సాయంత్రం 5:30 కి బయలుదేరి రాత్రి 11:30 కి మార్కాపురం చేరుకుంటుంది. మార్కాపురం ప్రతిరోజు తెల్లవారుజామున 4:30కి బయలుదే ఉదయం 10:30 కి గుంతకల్లు చేరుతుంది