దర్శి: దర్శిలో వాహనాలను తనిఖీ చేసి ఎల్ఈడి లైట్లు తొలగించిన పోలీసులు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాలకు ఉన్న ఎల్ఈడీ లైట్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు. రాత్రి వేళలో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం జరగకూడదని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాహనదారులను అప్రమత్తం చేశారు.