రాయదుర్గం: పట్టణంలోని సిద్దేశ్వర కాలనీలో చోరీ కలకలం
రాయదుర్గం సిద్దేశ్వర కాలనీలో చోరీ కలకలం రేపింది. మిత్రులతో తిరుపతి వెళ్లిన దివాకర్ ఇంటికి వచ్చి చూసేసరికి తాళం విరిగి ఉంది. దేవుడి ఫోటోల వెనుక దాచిన బంగారు డాలర్, చైన్, రెండు ఉంగరాలు సహా 3 తులాల బంగారం పోయిందని గుర్తించాడు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితుడు మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.