రాయదుర్గం: సెన్సెస్ లో స్వీయ ఇళ్ల గణన నమోదు చేసుకోండి : రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్
సెన్సెస్-2027 మెదటి విడతలో స్వీయ ఇళ్ల గణనలో ప్రజలందరూ తమ కుటుంబ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్ కోరారు. మంగళవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ నెల 30 వరకూ స్వీయ గణన ఉంటుందన్నారు. ఆన్ లైన్ లో సమర్పించిన కుటుంబ వివరాలు సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ లకు వెళతానని వివరించారు. వారు క్షేత్ర స్థాయిలో దృవీకరిస్తారని పేర్కొన్నారు.