రాయదుర్గం: పట్టణంలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు
రాయదుర్గం పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవరోజు శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు ఊరేగారు. ఆదివారం సాయంత్రం ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు కోట ఏరియా, ఊరువాకాలి, తేరు బజార్, బళ్ళారి రోడ్డుహమీదుగా మార్కండేయ స్వామి ఆలయం వరకూ సాగింది. దేవాదాయశాఖ ఈఓ నరసింహరెడ్డి, చేనేత కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు, కుర్ని సమాజ అద్యక్ష కార్యదర్శులు మాంత శ్రీనివాసులు, పత్రాల నాగరాజు, అలాగే బీసా శ్రీనివాసులు కాంబ్లి రాజశేఖర్, మురళీ, హిందూ ధార్మిక సంఘాల నాయకులు అగ్రభాగాన నడిచారు. బాలికలు ప్రదర్శించిన కోలాటం ఉ ఊరేగింపులో ఆకర్షణగా ని