రాప్తాడు: సీఎన్ కోటల గ్రామములో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల పంచాయతీ సీఎం కోట గ్రామంలో బుధవారం ఒంటిగంట పది నిమిషాల సమయంలో కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య టిడిపి నేతలతో కలిసి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతోనే సీఎం కోట గ్రామంలో 15 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని రోడ్డు నిర్మాణం నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్ ను కోరడం జరిగిందని కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య పేర్కొన్నారు.