దర్శి: దర్శి పట్టణంలో సీయోను ప్రార్థన మందిరం నందు ఏఐసీసీసి నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రకాశం జిల్లా దర్శి పట్నంలోని సీయోను ప్రార్థన మందిరం నందు ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ సమావేశాన్ని కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ దాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యుల ఎన్నికను గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఏఐసీసీసీ ఏపీ యూత్ కోఆర్డినేటర్ గా సురేష్ మరియు ఏపీ కోఆర్డినేటర్ గా ఆదామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చిల ఉన్నతికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.