ఉరవకొండ: వజ్రకరూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన మండల అధికారులు, గ్రామ సర్పంచ్
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ నందు మంగళవారం గుంతకల్ డిఎల్డివో విజయలక్ష్మి మరియు గ్రామ సర్పంచ్ మోనాలిసా,డిప్యూటీ ఎంపీడీవో దామోదర్ రెడ్డిల ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుటెండల మూలంగా మంచి నీరు తాగడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు.,అనంతరం సిబ్బందితో ఇంటి పన్నుల విషయమై సమావేశం నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.