మచిలీపట్నం: అవనిగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్
అవనిగడ్డ లో ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 101 మంది లబ్ధిదారులకు రూ. 82 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుద్ధప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మండలి వెంకట్రామ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.