సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థంలో జరుగు తిరునాళ్లకు వైసీపీ ఆధ్వర్యంలో 110 అడుగుల విద్యుత్ ప్రభ ఏర్పాటు
చీమకుర్తి మండలం రామతీర్థం లో జరగనున్న తిరుణాల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 110 అడుగుల భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో 110 అడుగుల విద్యుత్ ప్రభ ఏర్పాటు కు సంబంధించిన మెటీరియల్ ను భారీ వాహనంలో రామతీర్థంకు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బానిసంచా కాలుస్తూ, డప్పు వైద్యాల నడుమ ప్రభ తో రామతీర్థంకు తరలి వెళ్లారు.