దర్శి: దర్శి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహణ
Darsi, Prakasam | Apr 25, 2025 దర్శి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ చెత్త చెదారం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.