కనిగిరి: సంక్షేమ పథకాలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి: కనిగిరి మండల నూతన వ్యవసాయ శాఖ అధికారి జైనులాబ్దిన్
కనిగిరి మండల నూతన వ్యవసాయ శాఖ అధికారిగా షేక్ జైనులాబ్దిన్ శుక్రవారం కనిగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వ్యవసాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది జైనులాబ్దిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జైనులాబ్దిన్ మాట్లాడుతూ... కనిగిరి మండలంలో రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో రైతులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా చూడాలన్నారు. అరత గల ప్రతి రైతుకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.