జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి నూతనంగా మంజూరైన 369 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం 21 లక్షల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.