గిద్దలూరు: గిద్దలూరు మండలం కొండపేట సమీపంలోని సగిలేరు వాగులో ఈతకు వెళ్లి ఆసిఫ్ అనే యువకుడు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట గ్రామ సమీపంలోని సగిలేరు వాగులో ఈతకు వెళ్లి గిద్దలూరు పట్టణంలోని రామాలయం వీరికి చెందిన సయ్యద్ ఆసిఫ్(22) అనే యువకుడు మృతి చెందాడు. అంతకు ముందు వాగులో గల్లంతయిన యువకుడిని స్థానికులు, అధికారులు కలిసి వాగు నుంచి వెలికి తీశారు. యువకుడు స్వల్పంగా ప్రాణం ఉన్నట్లు మెదలడంతో బతికి ఉండే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు, గిద్దలూరు సీఐ సురేష్ తన వాహనంలో హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిపిఆర్ చేసిన వైద్యులు అప్పటికే యువకుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.