కనిగిరి: వైసిపి బలోపేతానికి నాయకులు సమన్వయంతో పని చేయాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: వైసిపి బలోపేతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచించారు. శనివారం కనిగిరిలోని నారాయణ యాదవ్ నివాసంలో చంద్రశేఖరపురం మండల వైసిపి నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కమిటీల నియామకానికి సంబంధించిన జాబితాను నారాయణ యాదవ్ కు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ.... చంద్రశేఖరపురం మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు పూర్తి కావాలని, గ్రామాల్లో వైసిపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.