ఎల్లారెడ్డిపేట: రోడ్డుకు మరమ్మతులు చేసిన గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ సమీపంలోని వంతెన అప్రోచ్ రోడ్డు అధ్వానంగా మారడంతో అక్కపెల్లి గ్రామ ప్రజలు చొరవ తీసుకున్నారు.ఆదివారం వాహనదారుల ఇబ్బందులు గుర్తించి, సొంత ఖర్చులతో ట్రాక్టర్ సహాయంతో గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రోడ్డును బాగు చేసిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆర్అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.