కనిగిరి: వేధింపులకు గురి చేసే ఆకతాయిల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి: పామూరు ఎస్సై కిషోర్ బాబు
పామూరు: వెంటపడి వేధింపులకు గురి చేసే ఆటతాయలు పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని పామూరు ఎస్సై కిషోర్ బాబు సూచించారు. పామూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం బాలికలకు ఎస్ఐ కిషోర్ బాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాల వెలుపల కానీ, లోపల కానీ ఎవరైనా వేధింపులకు గురి చేసినట్లయితే వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే పోలీసుల నుండి బాలికలకు తగు రక్షణ లభిస్తుంది అన్నారు.