దర్శి: దర్శి పట్టణంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన
ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలకు నిరసనగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 12వ PRC నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.