ఉరవకొండ: వజ్రకరూరులో రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో రోగులకు వాకర్లను పంపిణీ చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ వైద్య సిబ్బంది ద్వారా నడవలేని రోగులను గుర్తించి ప్రభుత్వం వారికి వాకర్లను అందజేశారు. ఈ వాకర్ల పంపిణీ కార్యక్రమం డాక్టర్ తేజస్వి,డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మోనాలిసా హాజరై రోగులకు వాకర్లను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్ఈ ఓ గురుప్రసాద్,సూపర్వైజర్ నాగ శంకర్,ఏఎన్ఎం లక్ష్మి, ఫార్మసిస్ట్ నాయక్,ఆశా కార్యకర్తలు ఆనందలక్ష్మి,మేరీ తదితరులు పాల్గొన్నారు.