శ్రీశైలం: శ్రీశైలంలో ఘనంగా ముగిసిన వరుణయాగం – సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 7న ప్రారంభమైన వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం ఐదు రోజులపాటు వైభవంగా కొనసాగి, పూర్ణాహుతితో ముగిసింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శాస్త్రోక్తంగా నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను హోమగుండంలో సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.