కళ్యాణదుర్గం: వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రద్దు అయిందనడం అవాస్తవం: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య
ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ జగన్ ప్రభుత్వం రద్దు అయిందని టీడీపీ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ ఎం రంగయ్య అన్నారు.కళ్యాణదుర్గం లో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ఎఫ్ సీ ఆర్ ఏ రద్దయిందన్నారు.మా ప్రభుత్వంలో రద్దయిందని టీడీపీ నేతలు అబద్ధం చెబుతున్నారని ఆ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు. వైయస్ జగన్ సూచనలతో పలు కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ అయ్యేటట్లు చేశామన్నారు.ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ అయింది కాబట్టి ఆర్డీటీని ఇక ఎవరు రాజకీయాలకు వాడుకోవద్దన్నారు.