స్వాతంత్ర సమరయోధుడు దళితుల ఆశాజ్యోతి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సభ విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముందుగా బాబు జగజ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. 36 వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కొప్పిలి వెంకటరావు, అంబేద్కర్ మిషన్ అధ్యక్షులు బొడ్డు కళ్యణ్ రావు , గొట్యివాడా నరసింగరావు, జె వి ప్రభాకర్, డాక్టర్ చదువుల ఆశ కిరణ్,పాల్గున్నారు