దర్శి: తాళ్లూరు మండలంలో చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీపీఓ వెంకట నాయుడు
Darsi, Prakasam | May 10, 2025 తాళ్లూరు మండలంలో డీపీవో వెంకట్ నాయుడు శనివారం చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాగుల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని వివిధ సమస్యలపై ఆయన ఆరా తీశారు.