దర్శి: తాళ్లూరులోని మాధవరంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షా ఫలితాల పత్రాల పంపిణీ
దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంలోని మాధవరంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భూసార పరీక్షా ఫలితాల పత్రాల పంపిణీలో ఏవో ప్రసాదరావు, ఎంపీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల పత్రాలను కలిగి ఉండాలని, రాబోవు రోజుల్లో వాటిని అనుసరించి రాయితీలపై సూక్ష్మ పోషకాలను అందజేయడం జరుగుతుందని ఎంపీపీ తెలిపారు