దర్శి: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ దర్శి డివిజన్ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమాలు నిర్వహణ
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ కురిచేడు దర్శి మండలాలలో గురువారం సీఐటీయూ దర్శి డివిజన్ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ర్యాలీ నిర్వహించి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద సమావేశమయ్యారు.