కనిగిరి: ముఠా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరావు
కనిగిరి: ముఠా కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు పీసీ కేశవరావు ప్రభుత్వాన్ని కోరారు. కనిగిరి తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ముఠా కార్మికులతో కలిసి ఆయన తహసిల్దార్ రవిశంకర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.... ముఠా కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, ముఠా కార్మికులు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు