అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన పాత నేరస్తులు, రౌడీషీటర్లను గుత్తి పోలీసులు తహసీల్దార్ పుణ్యవతి ఎదుట శుక్రవారం బైండోవర్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలంలోని పలు గ్రామాల్లో గతంలో అల్లర్లు, గొడవల్లో పాల్గొని పలు కేసులలో ఉన్న వారితో పాటుగా రౌడీషీటర్లకు పోలీసులు ముందస్తుగా నోటీసులు అందజేశారు. ఏలాంటి గొడవలకు పాల్పడమని వారితో రూ.1లక్ష సొంత పూచీకత్తు తీసుకొని తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారికి తహసీల్దార్ కౌన్సిలింగ్ ఇచ్చారు.