అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఊటకల్లు గ్రామంలో పాము కాటు వేయడంతో జయమ్మ(47) అనే మహిళ మృతి చెందింది. ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం ఊటకల్లు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ ఈ నెల 8న రాత్రి ఇంట్లో భోజనం చేసి ప్లేటు కడిగేందుకు లోపలకు వెళ్తుండగా తలుపు గడప వద్ద ఉన్న కట్ల పాము కాలికి కాటు వేసింది. పామును గమనించిన మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే పామును చంపి తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జయమ్మ కోలుకోలేక పరిస్థితి విషమించి మృతి చేసినట్టు ఎస్ఐ తెలిపారు.