గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న రెన్యూ సోలార్ ప్లాంట్ ఉన్నతాధికారులపై కొందరు టీడీపీ నాయకులు దాడి చేశారు. శనివారం ప్లాంట్ వర్గాలు, గుత్తి పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో రెన్యూ కంపెనీ సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ లో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. గుత్తి పట్టణానికి చెందిన కొందరు టిడిపి నాయకులు ఇసుక సరఫరా చేస్తామంటూ ప్లాంట్ వద్దకు టిప్పర్లతో వచ్చారు. తమ ఒక్కో టిప్పర్ రూ.23,500 తో తీసుకోవాలని వాదనకు దిగారు. ప్లాంట్ అధికారులపై దాడి చేశారు.