గుత్తి లోని వ్యవసాయం మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారం రాత్రి సుశీల అనే మహిళపై దాడి జరిగింది. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ప్రభావతమ్మ, సుశీల వర్గాలు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి పరమేశ్, ప్రభావతమ్మ తో పాటు మరి కొంతమంది సుశీలపై దాడి చేశారు. సుశీలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.