మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కీమోథెరపీ సేవలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 24 గంటలు క్యాన్సర్ రోగులకు చికిత్స లభించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.