కొండపి: టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో పొగాకు రూ.280: వేలం నిర్వహణ అధికారి అట్లూరి శ్రీనివాసరావు
టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో పొగాకు రూ.280 పలికిందని పొగాకు వేలం నిర్వహణ అధికారి అట్లూరి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఆలకూరపాడు, జయవరం గ్రామాలకు చెందిన రైతుల పొగాకు బేళ్లను కొనుగోలు చేశారని తెలిపారు . పెట్టుబడులు పెరిగినప్పటికీ గతేడాది కంటే తక్కువ ధర రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యర్లు ధరలు పెంచాలని కోరుతున్నారు.