రాయదుర్గం: పట్టణంలోని రాణిసత్రం బస్టాండు వద్ద సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
రాయదుర్గం పట్టణంలోని రాణిసత్రం బస్టాండు వద్ద సూర్య సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. సోమవారం మద్యాహ్నం ఆ సంస్థ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. మెదటి రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతీ ఏడూ క్రమం తప్పకుండా ఈ చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని సూర్య సేవా సమితి తీర్చడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టంకశాల హనుమంతు, బండి కృష్ణమూర్తి, పసుపులేటి వెంకటేషులు, షబ్బీర్, తాయి శేఖర్, ఉబేదుల్లా, బిఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.