తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాదాలను తాకిన సూర్యకిరణాలు
తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పాదాలను తాకాయి. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక పరిమళం గోచరించింది.