అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఎదురుగా అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. శుక్రవారం గుత్తి ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన బోయ సురేష్ అనే యువకుడు గురువారం రాత్రి సమయంలో గుత్తి అర్ఎస్ రోడ్డులో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న టమోటా మండీ దగ్గర బైక్ రోడ్డు పక్కన ఆపి బైక్ పైనే అపస్మారక స్థితిలో పడి పోయాడు. వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ ను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.