కొండపి: మరిపూడి మండల వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి సురేష్
మర్రిపూడి మండల వైసీపీ కార్యవర్గ సమావేశం కొండపి ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు . ఇనకొల్లు సుబ్బారెడ్డిని మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అదేవిధంగా మర్రిపూడి మండలంలోని 21 పంచాయతీల గ్రామ పార్టీ నాయకుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. అలాగే మండల సెల్స్ అధ్యక్షులను కూడా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి నూతనంగా నియమించబడ్డ కమిటీలు కృషి చేయాలని సూచించారు.