సంతనూతలపాడు: ఉపాధి హామీ పథకం సిబ్బందితో సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబు ఉపాధి హామీ పథకం సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ...గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఉపాధి కూలీలతో పనులు చేయించాలని,, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది ఫీల్డ్ లో ఉండాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా, వారికి మంచినీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.