కనిగిరి: పట్టణంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్
కనిగిరి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ సయనా బేగంతో కలిసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనదారులకు ఆయన జరిమాణాలు విధించారు. పరిమితికి మించి ఆటోల్లో కానీ ఇతర వాహనాల్లో కానీ ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ హెచ్చరించారు. రహదారులపై తరచూ వాహనాల తనిఖీలు జరుగుతుంటాయని, వాహనదారులు తప్పనిసరిగా తమ వద్ద సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, లేకుంటే చర్యలు తప్పమన్నారు.