రాప్తాడు: ఉప్పరపల్లిలో దళితుల ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తే పోరాటాలు చేస్తాం అనంతపురంలో ఉప్పరపల్లి వద్ద నివాసం ఉన్న దళిత సంఘం నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఉప్పరపల్లి వద్ద నివాసం ఉన్న దళితులతో కలిసి దళిత సంఘం నేతలంతా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత సంఘం నేత కేపి నారాయణస్వామి మాట్లాడుతూ ఉప్పరపల్లి వద్ద అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థానికులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి ప్రయత్నాలు చేసే దళితులందరినీ కలుపుకొని పోరాటాలు చేస్తామని దళిత సంఘం నేత కేపి నారాయణస్వామి పేర్కొన్నారు.