సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో భారీ ఊరేగింపుతో 110 అడుగుల భారీ ప్రభను రామతీర్థం తిరునాళ్లకు తరలించిన టిడిపి నాయకులు, కార్యకర్తలు
చీమకుర్తి మండలం రామతీర్థం లో ఏప్రిల్ 1వ తేదీన శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల జరగనుంది. ఈ నేపథ్యంలో టిడిపి ఆధ్వర్యంలో 110 అడుగుల భారీ ప్రభను ఏర్పాటు చేశారు చీమకుర్తి పట్టణ టిడిపి ఆధ్వర్యంలో భారీ ప్రభను సోమవారం భారీ ర్యాలీగా రామతీర్థంకు తరలించారు ఈ సందర్భంగా చీమకుర్తి పట్టణంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, డప్పు వాయిద్యాల నడుమ ప్రభను రామతీర్థంకు తరలించడం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.