దర్శి: దర్శిలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
దర్శిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ.. చివరి రోజైన సోషల్ స్టడీస్ పరీక్షను సంతోషంగా రాశామని తెలిపారు. నేటితో పదో తరగతి పరీక్షలు ముగిశాయని, ఇప్పటివరకు రాసిన అన్ని పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.